ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి

84చూసినవారు
ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోవద్దు: వైవీ సుబ్బారెడ్డి
ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏజెంట్లు నిర్ణీత సమయం కంటే ముందుగానే కౌంటింగ్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్