దొంగతనానికి వచ్చిన ఓ దొంగ నిద్రలోకి జారుకున్న ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. రాత్రి ఎవరూ లేకపోవడంతో అతను ఓ డాక్టర్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. అన్ని దోచుకొని మూట గట్టుకున్న తర్వాత మత్తు రావడంతో నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఇంటి తలుపు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి దొంగను నిద్ర లేపి అరెస్ట్ చేశారు.