రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ల 16వ సర్వాధ్యక్షుడు స్వామీ స్మరణానందజీ మహరాజ్ జీవితం ఆదర్శం కావాలని ఆయన పమరపదించినా ఆయన సూక్తులు భక్తుల మనస్సుల్లో నిలిచిపోతాయని అనపర్తి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు పడాల సుబ్బారెడ్డి అన్నారు. శనివారం అనపర్తిలోని కోళ్ల రైతుల కళ్యాణ మండపంలో జరిగిన స్వామీజీ సంతాప సభలో సేవా సమితి ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.