ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శుక్రవారం నిత్యాన్నదాన పథకానికి రూ. 1, 00, 000 విరాళాన్ని అందజేశారు. నరసయ్య అగ్రహారం గ్రామానికి చెందిన ప్రసాద్, సునీత ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. విరాళం అందజేసిన దాత కుటుంబానికి అధికారులు విరాళం బాండ్ పత్రాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు శ్రీవారు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.