తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 95. 44% పింఛన్లు పంపిణీ

65చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 95. 44% పింఛన్లు పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారంకి 95. 44% పింఛనుదారులకు నగదు పంపిణీ చేశారు. మొత్తం 2, 43, 831 మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధిదారులుండగా ఇప్పటి వరకూ 2, 29, 813 మందికి రూ. 69. 08 కోట్లు అందజేశామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. నల్లజర్ల మండలంలో అత్యధికంగా 96. 41%, గోకవరం 96. 39%, రాజమండ్రి సిటీలో 95. 67% పంపిణీ చేశామని వివరించారు. బిక్కవోలు 91. 15%, కొవ్వూరు 92. 15%తో చివరి స్థానంలో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్