వైసీపీ మేనిఫెస్టో అంకెల గారడీ మాత్రమే: ఆదిరెడ్డి

64చూసినవారు
వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంకెల గారడీ, అబద్ధాలు అని రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమండ్రి పార్టీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు తదితర హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధానిలేదని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్