జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా కొన్ని గంటల్లోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అమలాపురం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రితో కాసేపు ముచ్చటించారు.