ఉమ్మడి తూ. గో జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులకు సోమవారం రాజీనామ చేశారు. తాజాగా అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన దేవాంగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి శాంతి ప్రభాకర్ రాజీనామ చేశారు. ఈ మేరకు వారి రాజీనామ పత్రాన్ని బీసీ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి అందజేశారు.