బీమనపల్లిలో చెరువును తలపిస్తున్న రోడ్డు

57చూసినవారు
ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి వద్ద గొల్లవిల్లి వెళ్లే ప్రధాన రహదారి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి చెరువును తలపిస్తుంది. వాహనదారులు రోడ్డుపై ఉన్న గుంతలు కనపడకపోవడంతో వాహనాలు గుంతలలో పడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు శనివారం చెబుతున్నారు. డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడంతో నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుందని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్