విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి

55చూసినవారు
అనపర్తి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నందున ప్రజలు తమ విలువైన వస్తువులు ద్విచక్ర వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలని అనపర్తి ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. సోమవారం అనపర్తి పోలీస్ స్టేషన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలు ఊరు వెళ్ళేటప్పుడు నగలు, వాహనాలు విలువైన వస్తువులు తమకు నమ్మకమైన వారి ఇంట్లో భద్రపరిచి వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్