రామకృష్ణ మిషన్ కు రూ. లక్ష విరాళం అందజేత

63చూసినవారు
గిరిజనులకు, పేదలకు వైద్య సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ కు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం విరాళం అందజేశారు. అనపర్తి వివేకానంద సెంటర్ వద్ద శ్రీ రామకృష్ణ సేవా సమితి సమకూర్చిన రూ. లక్ష చెక్కును రామకృష్ణ మిషన్ చారిటబుల్ డిస్పెన్సరీ డైరెక్టర్ స్వామి రఘువీరానంద జి మహారాజ్ కు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్