అయినవిల్లి మండలంలోని అయినవిల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వరుని ఆలయంలో మంగళవారం భక్తులు నిర్వహించిన వివిధ సేవలు ద్వారా స్వామివారి ఆలయానికి రూ. 79, 000 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. వేకువజామున నుండి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు అని ఆయన తెలిపారు.