మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో ఆదివారం వైసీపీ కి చెందిన ముస్లిం సోదరులు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, 2024 ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ పి. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి విప్పర్తి వేణు గోపాలరావు కి ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయాలని అభ్యర్ధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సజ్జాద్ హుస్సేన్, అన్వర్ తాహర్ హుస్సేన్, నూరైన్ అబ్బాస్, జక్కం పూడి వాసు, గులాం అబ్బాస్, అస్కరి కాషాని, ఇలియాస్, షేక్ దూదు, షకీల్, అల్తాఫ్, మొహమ్మద్ తఖి, కిర్దార్ తదితరులు పాల్గొన్నారు.