వరద‌ బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో సహాయ నిధి వసూలు

51చూసినవారు
వరద‌ బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో సహాయ నిధి వసూలు
విజయవాడ వరద‌ బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కాకినాడ జిజిహెచ్ నాన్ స్టాప్ కౌంటర్ వద్ద సహాయ నిధి వసూలు చేసారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె. సత్తిరాజు మాట్లాడుతూ విజయవాడ నగరంలో వరద ముంపు ప్రాంతాల పరిస్థితి చాలా దయనీయం గా ఉందన్నారు. ప్రభుత్వం, సంస్థలు ఎంతగా సహాయం చేసినా, ఇంకా సహాయం అందించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆహారం, మంచినీరు కోసం బాధితుల ఎదురు చూస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్