హామీలను అడ్డుపెట్టుకుని అధికారం చేపట్టిన
జగన్ సర్కార్ అయిదేళ్లు పూర్తికావస్తున్నా వాటిపై దృష్టి సారించక 85 శాతం హామీలను తుంగలో తొక్కారని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం,
జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని బండారు బులిసత్యం, చంద్రవతి కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యానందరావు మాట్లాడారు.