సామర్లకోట: భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే గ్రామ సభలు

63చూసినవారు
తన భూమికి హక్కులు పొందడం లో హక్కు పత్రాల నమోదులో తప్పులు సవరించుకునేందుకు ప్రభుత్వం రీ సర్వే గ్రామసభల పేరిట అవకాశాన్ని ఇచ్చినందున సద్వినియోగం చేసుకోవాలని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖర రెడ్డి అన్నారు. రీ సర్వే గ్రామ సభ సామర్లకోట మండలం ఉండూరులో రెవెన్యూ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఆయా భూహక్కుదారులు 27 మంది నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామసభలలో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్