విషాదం.. వాగులో మునిగి ఇద్దరి మృతి

5845చూసినవారు
విషాదం.. వాగులో మునిగి ఇద్దరి మృతి
రంపచోడవరం విహార యాత్రకు వెళ్లి నీటి వాగులో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి సామర్లకోట గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు సామర్లకోట కు చెందిన పెయింటర్లు వర్ధనపు రాజ్ కుమార్, మాసా అవినాష్ గా గుర్తించారు. మొత్తం 13 మంది వ్యక్తులు సీతపల్లి వాగుకు విహారయాత్రకు వెళ్లడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మృతి చెందడంతో గణేష్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్