పిఠాపురం జనసేనపార్టీ నేతల్లో ఆదివారం మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు రోడ్డుపైనే ఘర్షణ పడటంతో కార్యకర్తలు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు నిందలు వేస్తూ జనసేన నేతలు ఘర్షణ చేపట్టారు. ఒకపక్క పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తుండగా వర్గ విభేదాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంత మంది ఇన్చార్జిలను మార్చిన పిఠాపురంలో వర్గ వైఖరి పోలేదు.