పిఠాపురం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీతకు అస్వస్థత పాలయ్యారు. గత నెల రోజుల నుంచి ప్రచారంలో దూసుకుపోతున్న వంగా గీత గురువారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో గల ఎఫ్ కే పాలెం , కందరాడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. అక్కడ నుంచే నేరుగా పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి, వైద్యం అందజేశారు.