ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ జగదీష్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అసభ్యకర, అభ్యంతర, రెచ్చగొట్టే పోస్టులు, ట్రోలింగ్లకు సంబంధించి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రూప్ అడ్మిన్లే బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అలా తప్పుడు పోస్టులు ఎవరైనా పెడితే 9440796577 నంబర్కు సమాచారం అందివ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.