ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలు జగన్ నిర్వాకం వల్ల వాటి కోసం ఇంకా పడిగాపులు కాస్తున్నారని టీడీపీ నగర కమిటీ అధ్యక్షులు బుడ్డిగ రాధా, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షుడు ఎస్ రాజేష్ ఖన్నా, బీజేపీ నాయకులు కందికొండ రమేష్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమండ్రిలో వారు మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీనే పెన్షన్లు అందించే ముఖ్యమంత్రి జగన్ ఈ నెల ఎందుకు ఆలస్యం చేశారని నిలదీశారు.