రాజమండ్రి నగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు

567చూసినవారు
రాజమండ్రి నగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒక్కోసారి గెలుపొందాయి. రాజమండ్రి నగరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మార్గాని భరత్‌రామ్‌ (బీసీ), టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, కాంగ్రెస్ నుండి బోడ లక్ష్మి వెంకట ప్రసన్న పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమండ్రి నగరం గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్