రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే రావాలని, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని అవ్వా, తాతలు, దివ్యాంగులు తదితర పెన్షన్ దారులు రోడ్డెక్కారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చిన వందలాది పెన్షన్ లబ్ధిదారులు ఎంపీ భరత్కు తమ గోడు విన్నవించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేస్తోందని తెలిపారు.