రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, దాని ప్రాధాన్యత ఏమిటి అనే దానిపై కడియం మండలం వేమగిరిలో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డిఆర్డిఎ ఆధ్వర్యంలో మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు వినియోగానికి సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటూ ప్రతిజ్ఞ చేసారు.