ఈనెల 14న రాజమండ్రికి మంత్రి సత్యకుమార్ రాక

75చూసినవారు
ఈనెల 14న రాజమండ్రికి మంత్రి సత్యకుమార్ రాక
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల 14న తూ. గో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన రాజమండ్రి వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించనున్నట్లు అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణాలు, ఆసుపత్రిలోని వసతులను పరిశీలిస్తారన్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆసుపత్రి, కళాశాల సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్