రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలకు చేరువ చెయ్యాలని రాజానగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం సీతానగరం మండలం కాటవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం అభివృద్ధికి కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.