గోకవరం మండల ప్రముఖ వైసీపీ నాయకులు దాసరి సతీష్ జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారంసాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైయస్సార్ పార్టీ టౌన్ కన్వీనర్ చింతల అనిల్ కుమార్ మరియు 200 మంది కుటుంబాలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు.