విజయవాడలో ఈ నెల 5న విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న హైందవ శంఖారావంపై బుధవారం సమరసత ఫౌండేషన్ సభ్యులు ప్రచారం చేశారు. హిందువులు అంతా తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. రాజవొమ్మంగి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.