ఎటపాక మండలం వెంకటరెడ్డి పేట జాతరలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సాయి కిరణ్ 15 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.