మలికిపురం: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

70చూసినవారు
మలికిపురం: లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
మలికిపురం మండలంలోని విశ్వేశ్వరరాయపురం గ్రామంలో ఉన్న క్యాంప్ కార్యాలయం వద్ద రాజోలు నియోజకవర్గం చెందిన 22 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం అందజేశారు. 22 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 17 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్