మలికిపురం: ఇసుక సమస్యకు త్వరలోనే పరిష్కారం

76చూసినవారు
ఇసుక సమస్య త్వరలో పరిష్కారం కాబోతుందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. మలికిపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి పనులతో పాటు ఇళ్ల నిర్మాణానికి ఇసుక అవసరమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. త్వరలోనే ఇసుక అందుబాటులోకి రాబోతున్నందున్న సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్