ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటా
గొల్లప్రోలు మండలం చెందుర్తి, కొడవలి, చేబ్రోలులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ తాను నియోజకవర్గ ప్రజలందరికి అండగా నిలిచి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని, లోకల్ హీరో కావాలో సినిహిరో కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలను గడప వద్దకే అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు.