రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

84చూసినవారు
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట రైల్వేగేట్ సమీపంలో శుక్రవారం ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఏలూరు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన రామేన్ లింబు (40) న్యూ టిన్సుకియా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు అన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించమన్నారు.

సంబంధిత పోస్ట్