అందరూ కలిసి కట్టుగా కృషి చేసి కూటమిని అధికారంలోకి తీసుకురావాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఏలూరు టిడిపి పార్టీ కార్యాలయంలో అందరితో పార్లమెంట్ పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు, మూడు పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.