ఏలూరు రూరల్ మండలం పాలగుడెం గ్రామంలో శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఆయన పర్యటించి రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి మరలా ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.