వరుస చోరీలను అరికట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలు

577చూసినవారు
ముదినేపల్లి మండలంలో జరుగుతున్న వరుస దొంగతనాలు అరికట్టేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు ఇప్పటి వరకు 55 సీసీ ఫుటేజ్ లను పరిశీలించి కొన్ని ఆధారాలు సైతం సేకరించారన్నారు. ఇప్పటి వరకు ఎనిమిది కేసుల నమోదు చేశామని త్వరలోనే నిందితులు పట్టుకుని చోరీ సొమ్మును రికవరీ చేస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్