వరద బాధితులకు నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ చేయూత

52చూసినవారు
విజయవాడ వరద బాధితులకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అపన్న హస్తం అందించారు. గురువారం 5వేల వరద బాధిత కుటుంబాలకు సరిపోయేలా బియ్యం, బిస్కెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇతర నిత్యావసర సరుకులను, 14 వాహనాలలో విజయవాడ వరద బాధిత ప్రాంతాలకు తరలించారు. నరసాపురం నియోజవర్గం తరపున కలెక్టరు చదలవాడ నాగరాణి, శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ లు సంయుక్తంగా జెండా ఊపి వాహనాలను విజయవాడకు పంపారు.

సంబంధిత పోస్ట్