నూజివీడు త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ డైరెక్టర్ గా అమరేంద్ర కుమార్

83చూసినవారు
నూజివీడు త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ డైరెక్టర్ గా అమరేంద్ర కుమార్
నూజివీడు క్యాంపస్ కు ఇంచార్జ్ డైరెక్టర్ గా ఆర్కే ర్యాలీ క్యాంపస్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న అమరేంద్ర కుమార్ సండ్ర గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన 2016లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా చేరి 2021వ సంవత్సరంలో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. ఆర్కే ర్యాలీ క్యాంపస్ నందు అనేక పరిపాలన విధులు కూడా నిర్వహించారు. యూజీ 2024 అడ్మిషన్స్ కన్వీనర్ గా కూడా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్