కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధుడు

54చూసినవారు
నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో గురువారం పటాపంచల వెంకటేశ్వరరావు(61) పై కోతులు దాడి చేశాయి. ఇంటి సమీపంలో గడ్డివాము వద్ద గడ్డి తీసుకొని వస్తుండగా కోతులు అడ్డగించాయి. దీంతో బాధితుడుపై కోతులు ఒక్కసారిగా దాడి చేయడంతో గాయాలు పాలయ్యాడు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. కాలికి బలమైన గాయం కావడంతో వైద్యులు వైద్య పరీక్షలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్