కొయ్యలగూడెం పట్టణంలో సోమవారం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళా రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి 23 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో ఏ రోజు దాని గురించి మాట్లాడలేదని అన్నారు. మరలా ఎన్నికలు సమీపించిన తరుణంలో మెగా డీఎస్సీ అని దగ్గర డీఎస్సీ తీశారని ఆమె మండిపడ్డారు.