వరద బాధితుల సహాయార్థం విరాళాలు

51చూసినవారు
వరద బాధితుల సహాయార్థం విరాళాలు
విజయవాడ వరద బాధితుల సహాయార్థం పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన పలువురు దాతలు ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.ఈ సందర్భంగా ఆదివారం పలువురు దాతలు నుండి సేకరించిన ₹. 2,35,000 చెక్కులను ఎమ్మెల్యే అందుకున్నారు.అనంతరం ఎమ్మెల్యే దాతలను అభినందించారు.అలాగే ప్రతి ఒక్కరూ వరద బాధితులకు అండగా నిలవడం గొప్ప విషయం అన్నారు.

సంబంధిత పోస్ట్