రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉంగుటూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గణపవరంలో సోమవారం జరిగిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రహదారులు దెబ్బతిన్నాయని అలాగే చాలా గ్రామాలలో మంచినీటి సదుపాయం లేదని అన్నారు. అలాగే ఆక్వా రైతులను ఆదుకుంటామని తెలిపారు.