ఏపీ మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్లో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.. గతేడాది ఆమె భర్త ఎర్నేని నాగేంద్రనాథ్ మృతి చెందడంతో సీతాదేవి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అప్పటి నుంచి ఆమె కోలుకోలేదు. ఆమె మృతిపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి పనిచేశారు.