AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. గన్నవరం కోర్టు ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతించింది. శ్రీధర్రెడ్డి అనే వ్యక్తి భూ వివాదానికి సంబంధించి ఆత్కూరు PS లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఉంగుటూరు పోలీస్స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై విచారించేందుకు కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడంతో.. విచారణ చేపట్టిన కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతిచ్చింది.