భారీగా పెరుగుతున్న ధోని మేనియా సీఎస్కే టీంకు మంచిది కాదని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకు స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీంలోని మిగత బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది బాధ కలిగిస్తుంది' అని వెల్లడించారు. అయితే శుక్రవారం సీఎస్కే, ఆర్సీబీ టీం పోటి పడుతున్న విషయం తెలిసిందే.