AP: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర రవాణా శాఖ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల రోజుల్లోనే ఈ పథకం అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణికులు, ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క బస్సూ కొనలేదని మండిపడ్డారు.