రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు: బెంగాల్‌ గవర్నర్‌

84చూసినవారు
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు: బెంగాల్‌ గవర్నర్‌
పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి ఆనంద బోస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రస్తుతమున్న కోల్‌కతా పోలీసులతో తన భద్రతకు ముప్పు ఉందని తెలిపారు. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ విషయంపై ఇప్పటికే తాను సీఎం మమతాబెనర్జీకి సమాచారం ఇచ్చానని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నారు. కాగా, తన అధికారిక నివాసంలో ఉన్న పోలీసు సిబ్బంది తనపై నిఘా ఉంచారంటూ ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్