తెలుగుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో మహిళా సాధికారితపై చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. 1995లో తానే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు వేశానన్నారు. రాజధాని అమరావతి కోసం మహిళలు ఐదేళ్లు నిర్విరామంగా పోరాటం చేసి ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళల సాధికారితకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.