ఢిల్లిలోని ఎయిమ్స్ నుంచి భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో ఉప రాష్ట్రపతిని సిబ్బంది ఎయిమ్స్లో చేర్పించారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.