విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తో పాటు విల్లూరి భాస్కరరావు, ఉరుకూటి నారాయణరావు, బత్తి మంగరాజు, మణమ్మ, కంటిపిల్లి వరలక్ష్మి, గౌరీ శంకర్, రామిరెడ్డి, నిమ్మ శ్రీనివాస్, ముక్కు శ్రీనివాస్ తదితరులు చేరారు.